ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ హౌస్‌లో ప్రణబ్‌ముఖర్జీకి వీడ్కోలు కార్యక్రమం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 21, 2017, 08:37 AM

న్యూఢిల్లీ : భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 25 ఉదయం ప్రమాణం చేస్తారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్‌తో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరవుతారు. మరోవైపు ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి కేంద్రం శనివారం (22)న హైదరాబాద్ హౌస్‌లో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎంలందరికీ ప్రధాని మోదీ ఆహ్వానం అందింది. సీఎం కే చంద్రశేఖర్‌రావుకు కూడా ఆహ్వానం అందింది. ఎంపీల తరఫున 23న పార్లమెంట్ సెంట్రల్ హాలులో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మరో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com