న్యూఢిల్లీ : భారత 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఈ నెల 25 ఉదయం ప్రమాణం చేస్తారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్తో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరవుతారు. మరోవైపు ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి కేంద్రం శనివారం (22)న హైదరాబాద్ హౌస్లో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎంలందరికీ ప్రధాని మోదీ ఆహ్వానం అందింది. సీఎం కే చంద్రశేఖర్రావుకు కూడా ఆహ్వానం అందింది. ఎంపీల తరఫున 23న పార్లమెంట్ సెంట్రల్ హాలులో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మరో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు.