భద్రాచలం : భద్రాచలం ఏజెన్సీలో గోదావరి ఉరకలు పెడుతోంది.ఒక్కరోజే పుణ్యక్షేత్రం భద్రగిరిలో 13 అడుగుల గోదా వరి పెరగడం 36.6 అడుగుల వద్ద గోదావరి నిలకడగా ఉంది.ఇదిలా ఉండగా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టులో వరద ఉధృతి తగ్గలేదు. ఏజెన్సీలో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతూనే ఉన్నాయి. పలు గిరిజన గ్రామాలకు ఏర్పడిన అంతరాయం తొలగలేదు.వరద పరిస్థితిని జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంత్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.