జనగామ జిల్లా కేంద్రంలో ఆషాఢమాసం బోనాల పండుగ ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ అల్లమరాజు శ్రీదేవసేన మొదటి బోనాన్ని ఎత్తుకున్నారు. మహంకాళి ఆలయంలో అమ్మవారికి బోనం సమర్పించిన కలెక్టర్.. మొక్కులు చెల్లించుకున్నారు. తదనంతరం ఆలయ ఆవరణలో శ్రీదేవసేన తులసి మొక్క నాటారు. హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.