ట్రెండింగ్
Epaper    English    தமிழ்

9 ఏళ్ల గరిష్ట స్థాయికి దూసుకుపోయిన రిలయన్స్!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 21, 2017, 01:20 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ వరాల జల్లు కురిపించారు. జియో కొత్త ఫోన్లు, అన్ లిమిటెడ్ డేటా, అన్ లిమిటెడ్ టాక్ టైమ్, ఫోన్ టు టీవీ కనెక్టివిటీ ఇలా ఎన్నో కొత్త కార్యక్రమాలను, పథకాలను ఆయన ప్రకటించారు. మరోవైపు, ఈ త్రైమాసికంలో విశ్లేషకుల అంచనాలను మించి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 9,108 కోట్ల నికర లాభాన్ని పొందింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో ఇది 28 శాతం ఎక్కువ. ఈ నేపథ్యంలో, స్టాక్ మర్కెట్లలో రిలయన్స్ షేర్లు దూసుకుపోయాయి. ప్రస్తుతానికి ఒక్కో షేరు ధర 4 శాతం పెరిగి, 9 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. బీఎస్ఈలో కంపెనీ షేరు విలువ 3.85 శాతం, ఎన్ఎస్ఈలో 3.86 శాతం పెరిగింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com