సంచలనాలకు కేంద్రబిందువుగా ఉండే వర్మ కొద్ది రోజులుగా డ్రగ్స్ వ్యవహారంలో అనుమానితులుగా ఉన్న టాలీవుడ్ సెలబ్రిటీల విచారణకి సంబందించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయే సరికి అందరు ఆశ్చర్యపోయారు. కాని కొద్ది రోజుల క్రితం ట్విట్టర్ నుండి బయటకు వచ్చిన వర్మ తాజాగా తన ఫేస్ బుక్ పేజ్ లో తన దైన కామెంట్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. సీరియస్ మేటర్ పై ఫన్నీ కామెంట్స్ చేసిన వర్మ సిట్ అధికారితో రాజమౌళి బాహుబలి 3 తీయాలేమో అని ఎద్దేవా చేశాడు.
డ్సగ్స్ దర్యాప్తు అంశంపై ఫేస్ బుక్ లో ఓ నోటు పెట్టిన వర్మ తాను స్కూల్ పిల్లలు డ్రగ్స్ వాడుతున్నారనే విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయానని అన్నాడు. పిల్లలకి కూడా సమన్లు అందజేసి పూరీ,సుబ్బరాజు మాదిరిగా 12 గంటలు ఇంటరాగేట్ చేస్తారా.. జస్ట్ అడుగుతున్నాను అని అన్నాడు. ఇక ఫిలిం ఇండస్ట్రీని టీజర్ గా, ట్రైలర్ గా వాడుకున్నందున ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ గురించి ప్రజలకు బాగా తెలిసిందని అన్నాడు. డ్రగ్స్ వ్యవహారంపై పై దర్యాప్తు చేస్తున్న అకున్ సబర్వాల్ ను తెలుగు మీడియా అమరేంద్ర బాహుబలి లెవెల్ లో పొగిడేస్తోందని, ఈ క్రమంలో రాజమౌళి ఆయనతో బాహుబలి 3 తీస్తాడేమోనంటూ చమత్కరించాడు వర్మ.