డ్రగ్స్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు సమర్థులేనని, చట్టానికి లోబడే విచారణ చేస్తున్నామని సిట్ అధికారి చంద్రవదన్ తెలిపారు. కేసులో భాగంగా అరెస్టైన 19 మందిలో 6 గురు ముఖ్యులని, ఎక్సైజ్ చట్టం ప్రకారం విచారణ చేసే అధికారం తమకుందన్నారు. ఓ వర్గాన్నే టార్గెట్ చేసి విచారణ చేస్తున్నామని ఆరోపణలు చేయడం సబబు కాదని, అన్ని రంగాలకు చెందిన వారిని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa