ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రగ్స్ వ్యవహారంపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్సీ పొంగులేటి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 25, 2017, 04:17 PM

డ్రగ్స్ కేసులో సిట్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ లో నైజీరియన్లపై నిఘా కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా గతంలో సంచలనం రేకెత్తించిన బోఫోర్స్ కుంభకోణం గురించి ఆయన ప్రస్తావించారు. ముగిసిన బోఫోర్స్ కేసును బీజేపీ మళ్లీ తెరపైకి తెస్తోందని, రాజీవ్ గాంధీకి చెడ్డపేరు తేవాలని బీజేపీ చూస్తోందని ఆయన మండిపడ్డారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa