ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడుని తెలంగాణ మంత్రి కేటీఆర్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ లు కూడా ఉన్నారు. దేశంలో రెండో అత్యున్నత పదవిని చేపట్టబోతున్న (ఉప రాష్ట్రపతి ఎన్నిక) సందర్భంగా వెంకయ్యకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్యకు చేనేత దుస్తులను, ఓ మొక్కను బహుమతిగా అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa