భారత-శ్రీలంక మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. 344/3 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో కోహ్లీ సేన తిరిగి బ్యాటింగ్ చేపట్టింది. ఈ రోజు ఆట ఆరంభంలోనే భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. 92వ ఓవర్లో కరుణరత్నే వేసిన ఐదో బంతిని ఎదుర్కొన్న పుజారా(133) ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. ఇప్పటి వరకు 40 టెస్టులాడిన కరుణతర్నేకు ఇదే తొలి వికెట్ కావడం విశేషం.
94 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రహానె(106), అశ్విన్(8) ఉన్నారు.