ఉద్యమ సమయంలోను ఉలికి పాడనీ కేసీఆర్ ప్రతి పక్షాలను చూడగానే గాయి గాయి చేస్తుండు. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రశాంతంగా వుండే కేసీఆర్, ఈమధ్య ఎందుకో ప్రతి పక్షాలను చూస్తే మాత్రం అంతెత్తుకు ఎగురుతుండు. ఢిల్లీ నుంచి వచ్చే నాయకులను చూడగానే గాభరాపడుతున్నారు. మొన్న అమిత్ షా వచినప్పుడు నిప్పులు చెరిగిన కేసీఆర్ , నిన్న కాంగ్రెస్ పార్టీ కి చెందిన మీరాకుమార్
వచిన్నప్పుడు అంతకంటే ఎక్కువే రెచ్చి పోయారు . ఉద్యమ సమయంలోను ప్రశాంతంగా వున్నా కేసీఆర్ ప్రతి పక్షాలను చూస్తే వణికిపోతున్నారు . నల్గొండ పర్యటనలో అమిత్ షా ఓ మాట అనగానే టీఆరెస్ నేతలంతా విరుచుకు పడ్డారు. మీడియాకు దూరంగా వున్నా కేసీఆర్ సాయంత్రానికే ప్రెస్ మీట్ పెట్టి మరి తిట్టారు . నేరెళ్ల బాధితులను మీరాకుమార్ వెల్లి పరామర్శించగానే మల్లి కేసీఆర్ గరమైండు. కాంగ్రెస్స్ తోనే మంచి పనులు ఆగి పోతున్న యంటూ గాయి గాయి చేస్తుండు.