హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు సెట్ సీ ప్రశ్నాపత్రం, ఏపీలో మొదటి సంవత్సరం ద్వితీయ భాష పరీక్షకు సెట్-3 ప్రశ్నాపత్రం ఎంపిక చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.