స్వాతంత్ర్య దినోత్స వేడుకలను పురస్కరించుకుని గోల్కొండ పీఎస్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 500 మంది పోలీసులు అణువణువు సోదాలు జరిపారు. ఈ నేపథ్యంలో ఆరుగురు రౌడీ షీటర్లు, 26 మందిని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 52 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.