బేగంపేట్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై బాంబు దాడి కేసును కొట్టేసింది నాంపల్లి కోర్టు. 12 ఏళ్ల పాటు విచారించిన కోర్టు ఆదారాల్లేవని కేసును కొట్టేసింది. 2005 అక్టోబర్ 12న టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై హర్కతుల్ జిహాద్ ఇస్లామి బంగ్లాదేశ్ సంస్థ దాడికి తెగబడింది. ఈ దాడిలో హోంగార్డ్ తో పాటు ఉగ్రవాది చనిపోయారు. అయితే ఇప్పటి వరకు కేసులో 10 మంది నిందితులను సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
జరిగింది ఏంటి..?
.. 2005 అక్టోబర్ 12న దసరా రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగింది. బ్యాగుతో టాస్క్ ఫోర్స్ ఆఫీసులోకి ప్రవేశించిన యువకుడు తనకు తాను కాల్చేసుకున్నాడు. ఈ ప్రమాదంలో హోంగార్డు చనిపోయాడు. .. పక్కా ప్లాన్తో ఉగ్రవాదులు నగర పోలీసు కమిషనరేట్లో కీలక విభాగమైన టాస్క్ఫోర్స్ కార్యాలయంపై దాడి చేశారు. .. మానవబాంబు ఘటనతో ఆర్డీఎక్స్తో హైదరాబాద్ నగరంలో నరమేధం సృష్టించేందుకు పన్నిన పన్నాగం బట్టబయలైంది. అదే జరిగుంటే హైదరాబాద్ నగరం సగం వరకూ తుడిచిపెట్టుకు పోయేదంటూ పోలీసు అధికారులు ఆందోళన వెలిబుచ్చటం ఇందుకు నిదర్శనం. .. నిఘావర్గాలు, పోలీసులు దర్యాప్తులో నిందితులను గుర్తించారు. పక్కా ఆధారాలతో మహ్మద్ అబ్దుల్ జాహెద్, అబ్దుల్ కలీమ్, షకీల్, సయ్యద్, హాజీ, అజ్మల్, అలీఖాన్, అజ్మత్, అలీ, మహబూబ్ బురానావాలా, షేక్ అబ్దుల్ఖాజా, నఫీజ్ బిశ్వాస్, బిలాలుద్దీన్ను అరెస్టు చేశారు. .. ఈ కేసులో 20 మంది నిందితులను సిట్ పేర్కొంది. వీరిపై కోర్టులో చార్జిషీట్స్ దాఖలు చేసింది. నిందితుల్లో కొందరు బంగ్లాదేశ్, పాకిస్థాన్లో ఉన్నారు. మరికొందరు పాక్, ఢిల్లీల్లో జరిగిన ఎన్కౌంటర్స్లో మరణించారు. కేసులో కీలకమైన సాక్షి ఫిరోజ్ఖాన్ అదృశ్యం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలింది. .. ప్రస్తుతం సిట్ 10 మందిని నిందితులుగా ఉన్నారు. ఒక్కరు మాత్రమే బెయిల్పై బయటకు వచ్చారని మిగిలిన 9 మంది విచారణ ఖైదీలుగా ఉన్నట్లు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. .. పేలింది మానవబాంబుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దర్యాప్తులోకి దిగిన పోలీసు వర్గాలు బీదర్, జహీరాబాద్, మలక్పేట, పాతబస్తీల్లో జల్లెడ పట్టారు. పదుల సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. చివరకు.. హర్కతుల్ జిహాదీ ఇస్లామ్ ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపిన దాలిన్ మానవహుతి బాంబుగా మారి దారుణానికి పాల్పడినట్లు తేల్చారు.