సికింద్రాబాద్ : ప్రతినెలా గాంధీ ఆస్పత్రిపై రివ్యూ నిర్వహించాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ఐసీయూను ప్రారంభించిన సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ… ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నేను కూడా ఇక్కడికే వైద్యం కోసం వస్తానన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెయింటినెన్స్ చాలా ముఖ్యమన్నారు. ఎక్కడైనా తప్పులుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.