జోగులాంబ గద్వాల: జిల్లాలోని ఇటిక్యాల మండలం బీచుపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. బోలేరో వాహనాన్ని లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.