న్యూఢిల్లీ: ఎన్డీఏ కూటమిలో కలవాలంటూ జేడీయూ నేత నితీశ్ కుమార్కు ఆహ్వానం అందించారు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. శుక్రవారం ప్రధాని మోదీతో బీహార్ సీఎం నితీశ్ కలిసిన తర్వాత ఈ ఆహ్వానం అందింది. నితీశ్తో మాట్లాడిన తర్వాత ఆయనకు ఆహ్వానం అందించినట్లు షా తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరే అంశాన్ని పాట్నాలో జరిగే సమావేశంలో జేడీయూ ప్రకటించే అవకాశాలున్నాయి. రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ పార్టీలకు జూలై 26న గుడ్బై చెప్పిన నితీశ్ ఆ తర్వాత బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జేడీయూ తరపున మొత్తం 12 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. లోక్సభలో ఇద్దరు, రాజ్యసభలో పది మంది ఉన్నారు.