మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కలిశారు. మన్మోహన్ సింగ్ ఇంటికి స్వయంగా వెళ్లిన వెంకయ్యనాయుడు కాసేపు ఆయనతో ముచ్చటించారు. మర్యాద పూర్వకంగానే మన్మోహన్ ను కలిసినట్లు వెంకయ్య చెప్పారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడును మన్మోహన్ సింగ్ అభినందించారు. సభలో అన్నిపార్టీలు అవకాశం వచ్చేలా పారదర్శకంగానే వ్యవహారించాలని సూచించారు.