ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేత్రదానం చేస్తానని ప్రకటించిన సీఎం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 13, 2017, 04:37 PM

పాట్నా: సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. మనిషి మరణించిన తర్వాత కూడా ఆ కళ్లు సజీవంగా ఉంచగలిగేదే నేత్రదానం. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన కళ్లను దానం చేయాలనుకుంటున్నట్టు ప్రకటించారు. అంతర్జాతీయ అవయదాన దినోత్సవం సందర్బంగా ఆదివారంనాడిక్కడ జరిగిన కార్యక్రమంలో నితీష్ ఈ ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా అవదాయదానం ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ప్రచారం జరగాలని ఆయన అభిలషించారు. 'మద్యపాన నిషేధంపై మనం ఎలాగైతే ప్రచారం చేశామో, కళ్లు, ఇతర అవయవదానంపై కూడా విస్తృత ప్రచారం జరపాల్సిన అవసరం ఉంది' అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. 2017 డిసెంబర్ నాటికి బీహార్‌లోని అన్ని మెడికల్ కాలేజీ ఆసుపత్రుల్లోనూ కంటి ఆసుపత్రులు, ఐ బ్యాంక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్యరంగంలో చాలా సాధించామని, ప్రతినెలా 11 వేల మంది ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి వైద్యసేవలు పొందుతున్నారని నితీష్ తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com