ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కైలాస సరోవర్ యాత్రను నిలిపివేశారు. మల్సా జిల్లాలో వరదల కారణంగా ముగ్గురు మృతి చెందారు. యాత్రకు వెళ్లిన వారిలో ఏడుగురు తప్పిపోయినట్లు సమాచారం. ప్రయాణికులతో పాటు నలుగురు పారాఫోర్స్ జవాన్లు గల్లంతయ్యారు. ప్రయాణికులు, పారాఫోర్స్ జవాన్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.