వనపర్తి జిల్లాలోని కొత్తకోటలో విద్యుత్ సబ్ స్టేషన్ కు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రూ. 6 కోట్ల వ్యయంతో ఈ విద్యుత్ సబ్ స్టేషన్ ను నిర్మించనున్నారు. సబ్ స్టేషన్ నిర్మాణంపై కొత్తకోట ప్రజలతో పాటు చుట్టూపక్కల గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.