స్థానిక తయారీదారులను ప్రోత్సహించాలని పెప్సీ, కోక్ కంపెనీలను బహిష్కరిస్తున్నట్లు తమిళ వ్యాపారులు వెల్లడించారు. దీంతో పెప్సీ, కోక్లకు రూ.1400 కోట్ల మేర నష్టం వాటిల్లనుంది. రాష్ట్రంలోని అతి పెద్ద వాణిజ్య సంఘం తమిళనాడు వానిగర్ సంగమ్ పెప్సీ, కోక్లను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంఘంలో ఆరు వేలకు పైగా చిన్న మధ్య తరహా దుకాణాలు, 15 లక్షలకు పైగా సభ్యులు ఉన్నారు. చిన్న చిన్న షాపుల్లోనూ ఇక నుంచి ఈ డ్రింక్స్ అమ్మబోరని సంఘం స్పష్టం చేసింది. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు కొంత సమయం కావాలని అడిగినా, తాము అంగీకరించలేదని సంఘం వెల్లడించింది. గత జనవరి నెలలో జల్లికట్టు కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా వాణిజ్య సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa