ఆదిలాబాద్: బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని కేంద్రమంత్రి సుజనా చౌదరి కుటుంబ సభ్యులు గురువారం ఉదయం దర్శించుకున్నారు. మంత్రి మనుమడు అర్జున్ ప్రసాద్కు అక్షరభ్యాసం నిర్వహించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు బాసరకు విచ్చేశారు. కాగా... అమ్మవారి సన్నిధికి కేంద్రమంత్రి విచ్చేయడంతో ఆలయ అధికారులు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు.