హైదరాబాద్: డీసీపీ సత్యనారాయణ నేతృత్వంలో ఇవాళ తెల్లవారుజామున నగరంలోని పాతబస్తీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. ఫలక్ నుమా, ఛత్రినాక పరిసర ప్రాంతాల్లో భారీగా తనిఖీలు నిర్వహించారు. అనుమానం ఉన్న 52 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. సరైన పత్రాలు లేని 70 బైకులు, 14 ఆటోలు, రెండు తల్వార్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.