ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స‌న్నీ లియోన్ రాక‌తో జ‌న‌సంద్రంగా మారిన కేర‌ళ‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 17, 2017, 06:13 PM

కొచ్చిలో ఓ మొబైల్ కంపెనీ ఆవిష్క‌ర‌ణ కోసం వ‌చ్చిన బాలీవుడ్ న‌టి స‌న్నీ లియోన్‌ను చూడ‌టానికి జ‌నం భారీగా త‌ర‌లి వ‌చ్చారు. వ‌చ్చిన జ‌నాన్ని చూసి స‌న్ని ఆశ్చ‌ర్య‌పోయారు. వారు చూపిస్తున్న ప్రేమ‌కు, అభిమానానికి ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. కొచ్చిలోని ఎంజీరోడ్‌లో `ఫోన్‌4 డిజిట‌ల్ హ‌బ్‌` ప్రారంభోత్స‌వానికి సన్నీ హ‌జ‌రయ్యారు. ఆమె రావ‌టం ఆల‌స్య‌మ‌వుతుంద‌ని తెలిసినా స‌న్నీ కోసం గంట‌ల త‌ర‌బ‌డి అభిమానులు ఎదురుచూశార‌ని నిర్వాహ‌కులు తెలిపారు. ఆమె వ‌చ్చాక అభిమానులంతా `వియ్ ల‌వ్ స‌న్నీ` అంటూ నినాదాలు కూడా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను స‌న్నీ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో షేర్ చేశారు. `కేర‌ళ అభిమానులు చూపించిన ప్రేమ‌ను నా జీవితంలో మ‌ర్చిపోలేను` అంటూ స‌న్నీ లియోన్ ట్వీట్ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com