హైదరాబాద్ : అవినీతి, అక్రమాలు, మాఫియాకు కేరాఫ్ అడ్రస్గా కేసీఆర్ పాలన చరిత్రలో నిలిచిపోతుందని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మీడియాతో ఉత్తమ్ మాట్లాడుతూ… అభివృద్ది, సంక్షేమం లేకుండా కుటుంబ పాలనే మిగిలిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల అడ్రస్ లేదని, ప్రైవేట్ ఉద్యోగాల జాడ లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో మంజూరైన ఐటీఐఆర్ ఒక్క అడుగూ ముందుకు పడట్లేదన్నారు.