హైదరాబాద్ : కాల్పుల కేసులో కాంగ్రెస్ యువ నేత విక్రమ్గౌడ్కు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. ప్రతీ ఆదివారం తప్పకుండా పోలీసుస్టేషన్కు వెళ్లి సంతకం చేయాలని కోర్టు విక్రమ్ గౌడ్కు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విక్రమ్గౌడ్ను ఆగస్టు 3న పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. అపోలో నుంచి నాంపల్లి కోర్టుకు తరలించిన విక్రమ్గౌడ్కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. విక్రమ్గౌడ్ను ఒక్క రోజు పోలీసు కస్టడీకి అనుమతించడంతో.. ఈ నెల 9న ఆయనను పోలీసులు విచారించి కీలక సమాచారం రాబట్టిన విషయం విదితమే.