హైదరాబాద్ : రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ఐకాస కృషి చేస్తోందని టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ… ప్రజాస్వామ్యం ఉంటేనే సమాజం నిలబడుతుందన్నారు. నేరెళ్లలో సభకు అనుమతిస్తే కొంపలు మునుగుతాయా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం 144, 38, 151 సెక్షన్లను దుర్వినియోగం చేస్తోందన్నారు. నేరం జరుగుతుందని భావిస్తేనే 155 సెక్షన్ వాడాలన్నారు. పై నుంచి ఆదేశాలంటూ పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు.