న్యూఢిల్లీ: డిజిటల్ పోలీస్ పోర్టల్ను ఇవాళ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు కింద ఈ పోర్టల్ను ఆవిష్కరించారు. నేరాలు, నేరస్తులకు సంబంధించిన డేటాను ఈ పోర్టల్లో పొందుపరుస్తారు. డిజిటల్ పోలీస్ పోర్టల్ ద్వారా సాధారణ పౌరులు ఆన్లైన్ ఫిర్యాదులు చేయవచ్చు అని కేంద్ర మంత్రి తెలిపారు. రాష్ట్ర పోలీస్ విభాగాలు, కేంద్ర ఇంటెలిజెన్స్ సంఘాలు కూడా డిజిటల్ పోర్టల్ నుంచి డేటాను షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ ప్రాజెక్ట్ (సీసీటీఎన్ఎస్) వ్యవస్థ మొత్తం 13,775 పోలీస్ స్టేషన్లలో ఉన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. సీసీటీఎన్ఎస్ వద్ద పాత నేరాలకు సంబంధించి ఏడు కోట్ల డేటా రికార్డులు ఉన్నాయని రాజ్నాథ్ చెప్పారు. 15,398 పోలీస్ స్టేషన్లకు సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు అనుసంధానం అవుతుందని మంత్రి చెప్పారు.