మొబైల్స్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్ఫోన్ 'రెడ్మీ నోట్ 5ఎ'ను ఇవాళ విడుదల చేసింది. స్టాండర్డ్, హై ఎండ్ పేరిట రెండు వేరియెంట్లలో ఈ ఫోన్ విడులైంది. రూ.8,645, రూ.11,530 ధరలకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. రేపటి నుంచి చైనాలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. తరువాత భారత్లోనూ ఈ ఫోన్ లభిస్తుంది. కాగా ఈ రెండు వేరియెంట్లలోనూ డెడికేటెడ్ మెమొరీ స్లాట్ను ఇచ్చారు. దీని వల్ల ఒకేసారి రెండు సిమ్ కార్డులు, ఒక మైక్రో ఎస్డీ కార్డును ఫోన్లో వేసుకోవచ్చు.
షియోమీ రెడ్మీ నోట్ 5ఎ స్టాండర్డ్ వేరియెంట్ ఫీచర్లు...
5.5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్కోర్ స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.
షియోమీ రెడ్మీ నోట్ 5ఎ హై ఎండ్ వేరియెంట్ ఫీచర్లు...
5.5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.