న్యూఢిల్లి : త్రిపుల్ తలాఖ్పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఉత్తమమైన తీర్పు అని కేంద్రమంత్రి మేనకా గాంధీ అన్నారు. ఈ తీర్పుతో లింగ న్యాయం, లింగ సమానత్వంవైపు మరొక అడుగు ముందుకు వేసినట్లయిందని ఆమె అన్నారు. త్రిపుల్ తలాఖ్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాను స్వాగతిస్తున్నానని త్రిపుల్ తలాఖ్ బాధితురాలు, ఈ కేసులో పిటిషనర్ షాయరాబానో అన్నారు.