న్యూఢిల్లి : కాంగ్రెస్ నాయకుడు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వైఖరి కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. అయోధ్యలో రాముడు జన్మించాడని హిందువులు విశ్వసిస్తున్నట్లుగా త్రిపుల్ తలాఖ్ అంశం కూడా ముస్లింల విశ్వాసాలకు సంబంధించినదని సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబాల్ సుప్రీంకోర్టులో వాదించారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున త్రిపుల్ తలాఖ్ కేసులో వాదించిన కపిల్ సిబాల్ ప్రజల విశ్వాసానికి రాజ్యాంగపరమైన చట్టబద్ధతలు పరిశీలించకూడదని అన్నారు. వాస్తవానికి త్రిపుల్ తలాఖ్ కేసులో సుప్రీంకోర్టు నేడు వెలువరించిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుండగా, కపిల్ సిబాల్ వైఖరి మాత్రం ఆ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తోంది.