హైదరాబాద్ : ఇంటర్ బోర్డు అధికారులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన అధికారులతో మాట్లాడుతూ ప్రతి ఆరు మాసాలకు ఒకసారి సమావేశమవుతామని, అవసరమైతే బోర్డు పునర్ వ్యవస్థీకరణ చేస్తామని తెలిపారు. ఒకేషనల్ కోర్సులు చేసిన వారికి 2018 నుంచి వెంటనే ఉపాధి దొరికేలా కొత్త కోర్సును ప్రవేశపెడతామని, కొన్ని ఒకేషనల్ కోర్సులను రద్దు చేస్తామని ఆయన వెల్లడించారు. అలాగే 404 జూనియర్ కళాశాలల ప్రొఫైల్స్ను ఇకపై వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొస్తామని, బోర్డులో అన్ని సర్వీసులు సజావుగా సాగుతాయని తెలిపారు. ప్రైవేట్ కాలేజీలను నియంత్రించే స్థాయికి బోర్డు చేరుకుందని, ఇకపై అక్రమాలను సహించబోమని కడియం హెచ్చరించారు.