ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం: అసదుద్దీన్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 22, 2017, 05:42 PM

హైదరాబాద్‌: ట్రిపుల్‌ తలాక్‌ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని అన్నారు. ఈ తీర్పు క్షేత్రస్థాయిలో అమలు అంత సులభం కాదన్నారు. చట్టాలుచేయడం, తీర్పులు వెలువరించడం వల్ల ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రిపుల్‌ తలాక్‌ అనేది ఓ సామాజిక అంశమని, సంస్కరణల ద్వారానే మార్పురావాలని అన్నారు. సామాజిక సంస్కరణలు జరిగి సమాజంలో మార్పులు రావాల్సి ఉందన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా చదివిన తర్వాత మళ్లీ దీనిపై స్పందించనున్నట్టు చెప్పారు. ప్రాథమిక హక్కులు ప్రకారం పర్సనల్‌ ‘లా’పై సవాల్‌ చేయడం కుదరదన్నారు. ఈ సాయంత్రం లోపు పర్సనల్‌ లా-బోర్డు ఈ తీర్పుపై స్పందించే అవకాశం ఉందని ఒవైసీ చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com