సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పథకాలు క్రమక్రమంగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే 176 పనులు పూర్తికాగా, మరో 65 పురోగతిలో ఉన్నాయి. పూర్తయినవాటిని ఈనెల 10న ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించాలని భావించారు. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా వేశారు. మోడల్ మార్కెట్లు, టాయిలెట్లు, బహుళ ప్రయోజనకర హాళ్లు, బస్బేలు, శ్మశానాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు తదితర ప్రాజెక్టులు జీహెచ్ఎంసీ చేపట్టింది. ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై ప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తూ త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికి 176 పనులు పూర్తయ్యాయి. వీటిపై ఇటీవలే ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించడంతో పాటు స్వయంగా పరిశీలించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఈ నిర్మాణాలు ప్రారంభింపజేయాలని అధికారులు భావించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా సీఎం నగర పర్యటన వాయిదాపడింది. కోడ్ పూర్తయిన తరువాత ప్రారంభోత్సవాలకు సన్నాహాలు చేస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు.
పూర్తయిన పనుల వివరాలు..
పని లక్ష్యం పూర్తయినవి పురోగతిలో.. తుదిదశలో.. టెండర్ దశలో..
బస్బేలు 50 50 0 0 0
మోడల్ మార్కెట్లు 40 14 26 0 0
మల్టీపర్పస్ హాళ్లు 16 0 11 1 4
టాయిలెట్లు 109 109 0 0 0
గ్రేవ్యార్డులు 24 1 22 0 1
స్పోర్ట్స్ కాంప్లెక్స్లు 9 2 6 0 1
మొత్తం 248 176 65 1 6