ఎల్బీనగర్ : మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దమని రాష్ట్రంలోని ముస్లింల ఓటర్లను ఆకర్షించేందుకు తెరాస ప్రభుత్వం 12శాతం రిజర్వేషన్ కల్పించాలని చూస్తుందని ఎమ్మెల్సీ రాంచందర్రావు అన్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ బీజేవైఎం రాష్ట్ర నాయకులు బొల్గంయశ్పాల్గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం ఎల్బీనగర్ చౌర స్తాలో సంతకాల సేకరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ రాంచందర్రావు మాట్లాడుతూ.... తెరాస ప్రభుత్వ రిజర్వేషన్ నిర్ణయాన్ని బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కల్పించిన 4శాతం రిజర్వేషన్ ఇప్పటికీ న్యాయస్థాన పరిశీలనలో ఉందన్నారు. తీర్పు వెలువడకముందే తెరాస ప్రభుత్వం 12శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు పూనుకోవడం ఏమిటని ప్రశ్నించారు.