న్యూఢిల్లీ: దేశ ప్రజలు ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఇవాళ్టి నుంచే జియో ఉచిత ఫోన్ బుకింగ్స్ ప్రారంభమవుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి బుకింగ్ మొదలువుతుంది. జూలై 21వ తేదీన జరిగిన ఏజీఎం సమావేశంలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ జియో ఉచిత ఫోన్ గురించి వివరాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఫ్రీ ఫోనే అయినా బుకింగ్ కోసం రూ.1500 చెల్లించాలి. ఇది సెక్యూర్టీ డిపాజిట్. ఈ మొత్తాన్ని మళ్లీ ఫోన్ను వాసప్ ఇచ్చిన రోజున తిరిగి ఇస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్న ఆధారంగా ఫోన్లను అందజేయనున్నారు. ముందుగా ఎవరు బుకింగ్ చేసుకుంటే వాళ్లకు ముందుగా ఫోన్ అందుతుంది. ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా జియో ఫ్రీ ఫోన్ను బుక్ చేసుకునే వీలు కల్పించారు.
ఆథరైజ్డ్ జియో రిటేలర్ లేదా రిలయన్స్ ఔట్లెట్కు వెళ్లండి. ఒక్క ఆధార్ నెంబర్ మీద ఒక్కరికి ఒక్క ఫోన్ మాత్రమే ఇస్తారు. ఆధార్ డిటేల్స్ ఇచ్చిన తర్వాత ఆ సమాచారం సెంట్రలైజ్డ్ సాఫ్ట్వేర్కు అప్లోడ్ అవుతుంది. ఆ తర్వాత మీకు టోకెన్ నెంబర్ వస్తుంది. ఫోన్ డెలివరీ సమయంలో ఈ నెంబర్ అవసరం ఉంటుంది.
ముందుగా ఆన్లైన్లో ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆఫిషియల్ వెబ్సైట్ jio.com ను విజిట్ చేయాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కాగానే, హోమ్పేజీపై ఇమేజ్ లేదా బటన్ డిస్ప్లే అవుతుంది. జియో ఫ్రీ మొబైల్ ఫోన్ రిజిస్ట్రేషన్లేదా ప్రీ బుకింగ్ బటన్ను క్లిక్ చేయాలి. అందులో పూర్తి సమాచారాన్ని ఎంటర్ చేయాలి. కాంటాక్ట్ నెంబర్, షిప్పింగ్ అడ్రస్ కూడా ఎంటర్ చేయాలి. క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ.1500 చెల్లించాలి. ఆ తర్వాత జియో ఫోన్ బుకింగ్ జరుగుతుంది. సెప్టెంబర్లో జియో ఫోన్ డెలివరీ మొదలవుతుంది. మైజియో యాప్ నుంచి కూడా జియో ఫ్రీ ఫోన్ బుకింగ్ చేసుకునే సదుపాయం ఉంది.