హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్లో స్వైన్ఫ్లూ మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. తాజాగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో శంషాబాద్కు చెందిన 35ఏళ్ల వ్యక్తి స్వైన్ఫ్లూతో మృతిచెందాడు. ప్రస్తుతం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్వైన్ఫ్లూ నిర్థరణతో చికిత్సపొందుతున్న వారి సంఖ్య 10మంది ఉండగా, అందులో ఆరుగురు చిన్నారులే ఉన్నారు. మరో ఇద్దరు ఆ వ్యాధి లక్షణాలతో గాంధీలో చేరడం కలకలం సృష్టించింది. ఈ ఏడాది జనవరి 1నుంచి ఇప్పటివరకు 8మంది స్వైన్ఫ్లూతో మృతిచెందారు.