బస్స్టేషన్ పైకప్పు ప్రమాదవశాత్తు కూలిన ఘటన కోయంబత్తూర్లోని సోమనూర్ పట్టణంలో చోటు చేసుకుంది. బస్స్టేషన్ పైకప్పు హఠాత్తుగా కింద ఉన్న ప్రయాణికులపై కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో ముగ్గురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలను కొనసాగిస్తున్నది. కాగా ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.