హైదరాబాద్: ఈ నెలలో ప్రారంభమయ్యే బతుకమ్మ సంబురాలు నిర్వహణ, ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డీజీపీ అనురాగ్శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బతుకమ్మ ఘాట్ల మరమ్మత్తు, పండుగ నిర్వహణ వ్యయం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. బతుకమ్మకు సంబురాలకు సంబంధించిన ప్రణాళికను విడుదల చేస్తామని సీఎస్ తెలిపారు.