హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళా బాక్సర్ గోనెల్ల నిహారిక సూపర్గా రాణిస్తున్నది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో జరుగుతున్న అహమెట్ కార్నెట్ బాక్సింగ్ టోర్నీ ఫైనల్లో ప్రవేశించింది హైదరాబాదీ ప్లేయర్ నిహారిక. ఆమె సెమీ ఫైనల్ బౌట్లో 3-2 తేడాతో సెల్మా కరకయూపై విజయం సాధించింది. 75 కిలోల క్యాటగిరీలో నిహారిక బాక్సింగ్ ఫైట్లో పాల్గోన్నది. థ్రిల్లింగ్లో సాగిన సెమీస్లో 17 ఏళ్ల నిహారిక కీలక దశలో చాలా కూల్గా ఆడి తీవ్ర వత్తిడిని జయించింది. ఇదే టోర్నమెంట్లో నిహారిక రష్యా ప్లేయర్ మీద కూడా విజయం సాధించడం గమనార్హం. ప్రీ క్వార్టర్స్లో నిహారిక రష్యాకు చెందిన లౌరా మమెద్కులీవాపై గెలుపొంది క్వార్టర్స్లోకి ప్రవేశించింది. గతంలో విశాఖపట్టణంలోని శాయ్ అకాడమీలో నిహారిక శిక్షణ పొందింది. ప్రస్తుతం జిందాల్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నది. ఫైనల్లో ప్రవేశించిన నిహారికకు కనీసం సిల్వర్ మెడలైనా దక్కడం ఖాయం. ఇవాళ రాత్రి ఫైనల్ మ్యాచ్ జరగనున్నది.