సూర్యాపేట: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. చింతలపాలెం మండలం కిష్టాపురం వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా లారీలో అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్లకు పైగా పీడీఎస్ బియ్యాన్ని గుర్తించిన పోలీసులు బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.