ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శరద్‌యాదవ్‌కు మరో వారం గడువు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2017, 04:46 PM

 రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేసే అంశంపై స్పందించేందుకు జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌, ఎంపీ అలీ అన్వర్‌కు మరోవారం రోజుల సమయం ఇస్తున్నట్లు రాజ్యసభ సచివాలయం తెలిపింది. గతంలో ఇచ్చిన వారం రోజుల గడువు సోమవారంతో ముగియగా.. పార్టీ కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్నందున నెలరోజుల సమయం కావాలని శరద్‌యాదవ్‌, అలీ అన్వర్‌ విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్థన పరిశీలించిన రాజ్యసభ సచివాలయం అదనంగా మరో వారం సమయం ఇస్తున్నట్లు తెలిపింది. ఈలోగా సభ్యత్వం రద్దు అంశంపై నోటీసులకు సమాధానం ఇవ్వాలని స్పష్టంచేసింది.


బిహార్‌లో ఆర్జేడీతో పొసగలేక మహాకూటమితో పొత్తుకు స్వస్తి పలికిన నితీశ్‌కుమార్‌.. భాజపాతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడాన్ని శరద్‌యాదవ్‌, అలీ అన్వర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించని ఇద్దరి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడికి జేడీయూ ఫిర్యాదు చేయగా.. వారిద్దరికి రాజ్యసభ సచివాలయం నుంచి తాఖీదులు అందాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com