హైదరాబాద్: గ్రూప్-1 ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంటర్వ్యూలో సెలక్ట్ అయిన కొంత మంది అభ్యర్థులను పక్కన పెట్టారంటూ పేర్కొంటూ కార్తీక్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం ఫలితాల వెల్లడిపై గతంలో స్టే విధించింది. కాగా తాజాగా ఆగస్ట్ 10వ తేదీ జరిగిన ఇంటర్వ్యూల రిజల్ట్స్ ఇవ్వాలని అభ్యర్థుల వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఫలితాలను ప్రకటించవచ్చని పేర్కొంటూ టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో 128 గ్రూప్ 1 పోస్టులకు లైన్ క్లియర్ అయ్యింది. అతిత్వరలోనే ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు.