ప్రముఖ కార్టూనిస్ట్ మోహన్ తెల్లవారుజామున మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉంచారు. పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1952 డిసెంబర్ 21 న ఏలూరులో జన్మించిన ఆయన పలు దిన, వార పత్రికలలో పొలిటికల్ కార్టూనిస్టుగా పలు పత్రికల్లో పని చేశారు.