హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్తో చర్చించి వీలైనంత త్వరగా విగ్రహం ఏర్పాటు చేస్తామని కడియం తెలిపారు. హెచ్ఎండీఏ నుంచి రావాల్సిన 30 ఎకరాలను ఇవ్వాలని సూచించామని, డిజైన్ల ఖరారు కోసం కన్సల్టెన్సీ నియమించాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. మొత్తం ప్రాజెక్ట్ను రెండు విభాగాలుగా విభజించాలని సూచించారు. డీపీఆర్లు రూపొందించి టెండర్లు పిలుస్తామని డిప్యూటీ సీఎం కడియం పేర్కొన్నారు..