ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. బతుకమ్మ వేడుకలు ఆ ఇంట విషాదాన్ని నింపాయి. అల్లారుముద్దుగా చూసుకుంటున్న తమ కూతురు విద్యుత్షాక్తో మృతిచెందడంతో గుండెలు పగిలేలా రోదించారు ఆ తల్లిదండ్రులు. అప్పటి వరకు ఆడిపాడిన తమ చిన్నారిని తీసుకెళ్లి పండుగపూట తమ కడుపుకోత మిగిల్చావు దేవుడా అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఈ హృదయవిదారక ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కొప్పురాయి పంచాయతీ లక్ష్మీపురంలో బుధవారం రాత్రి జరిగింది. లక్ష్మీపురానికి చెందిన నవీన్, సంజీవ్కుమారి దంపతుల కూతురు పోరండ్ల కల్యాణి (6), కుమారుడు ఉన్నారు. ఈక్రమంలో కల్యాణి నాయనమ్మతో కలిసి గ్రామంలో జరుగుతున్న బతుకమ్మ వేడుకలకు వెళ్లింది. అందరూ బతుకమ్మ ఆడుతుండగా 11కేవీ విద్యుత్ తీగతెగి చిన్నారిపై పడింది. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నాయనమ్మ ఈశ్వరమ్మకు గాయాలయ్యాయి.