తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ నేడిక్కడ సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకాల అంశంపై వారు చర్చించారు. ముల్లాపెరియార్ డ్యామ్లో నీటి నిలువల అంశం ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదాల్లో ప్రధానమైనది. సమావేశం అనంతరం కేరళ సిఎం విజయన్ విలేకరులతో మాట్లాడుతూ కేరళ, తమిళనాడు ప్రజలు సోదరీసోదరులని, వారి మధ్య ఏదైనా వివాదం ఉంటే చర్చలతో పరిష్కరించుకోవచ్చునని చెప్పారు.