హైదరాబాద్: కాళేశ్వరం ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ వేసింది. జీఎస్ఐ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ రాజు, జియాలజిస్ట్ రవీంద్రనాథ్, ఈఎన్సీలు నాగేంద్రరావు, అనిల్కుమార్తో కమిటీ వేశారు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశించింది. ప్రమాద కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం నివేదిక కోరింది.
మరోవైపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ స్టేజ్-2 అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర అటవీశాఖ మంత్రి హర్షవర్ధన్కు మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో కాళేశ్వరం ఎత్తిపోతల పనుల కోసం 600 ఎకరాల అటవీ భూమిని వినియోగించుకోవడానికి అడ్డంకులు తొలగాయి. అటవీ అనుమతులు లేకపోవడంతో ఆరేళ్లుగా నుంచి ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. వచ్చే జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. మంథని నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.