కోల్కతా : నా గొంతు కోసినా పర్వాలేదు.. శాంతి కోసం ఏం చేయాలో అదే చేస్తానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కోల్కతాలో ముహర్రం రోజున దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేయరాదు అని దీదీ చేసిన ఆదేశాలను ఇవాళ ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆ అంశంపై బెనర్జీ స్పందించారు. శాంతి స్థాపన కోసం ఏం చేయాలో తనకు తెలుసు అని, తన గొంతును ఎవరు కోసినా పర్వాలేదు కానీ, తాను ఏం చేయాలో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని దీదీ అన్నారు. సీఎం బెనర్జీ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని ఇవాళ హైకోర్టు సీరియస్ అయ్యింది.