ఇన్బానా అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి మూడు రోజుల పాటు శిల్పకళావేదికలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. గురువారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఇన్బానా హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షురాలు ఎ.వనిత, ఉపాధ్యక్షురాలు సుకన్య, కార్యదర్శి ఉషాభాగ్య, షర్మిల అగర్వాల్ మాట్లాడారు. తెలంగాణ టూరిజం సహకారంతో మూడు రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలపై వర్క్షాపు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. వర్క్షాపులో సింగపూర్తో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. 24న జరిగే ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్ హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర టూరిజం శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం పాల్గొంటారని తెలిపారు.